Tuesday, January 12, 2021

కేసీఆర్ ఖబడ్దార్... చెప్పా పెట్టకుండా ముట్టడిస్తాం... జనగామ లాఠీచార్జి ఘటనపై బండి సంజయ్ కౌంటర్...

జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్‌లో పనిచేస్తూ బీజేపీ కార్యకర్తల రక్తం కళ్లజూస్తున్నారని విమర్శించారు. ఇష్టానుసారం కేసులు పెడుతూ బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని... రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులను 24గంటల్లోగా సస్పెండ్ చేయాలని... లేనిపక్షంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంజయ్ హెచ్చరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nFOfNY

Related Posts:

0 comments:

Post a Comment