Thursday, May 16, 2019

వేధింపులు తట్టుకోలేకపోయారు.. కన్న పేగును కడతేర్చారు...

హైదరాబాద్ : ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించింది లేదంటారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు ఎలాంటి తప్పులు చేసినా కుడుపున దాచుకుంటారు. కానీ పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కొడుకే ప్రత్యక్ష నరకం చూపిస్తుండటంతో విసిగిపోయారు. కొడుకు రాక్షసత్వాన్ని భరించలేని ఆ తల్లిదండ్రులు కన్నప్రేమను చంపుకున్నారు. కిరాయి మనుషులతో కలిసి అతన్ని కడతేర్చారు. మానవత్వానికే మాయని మచ్చగా నిలిచే ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. 

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q5ECZJ

Related Posts:

0 comments:

Post a Comment