Wednesday, October 28, 2020

సీఎం అవినీతిపై సీబీఐ విచారణ... హైకోర్టు సంచలన ఆదేశాలు... షాక్‌లో బీజేపీ నేతలు...

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రావత్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఉమేశ్ కుమార్ శర్మ అనే జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ముఖ్యమంత్రిపై సీబీఐ విచారణకు ఆదేశాలిచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBFVzz

Related Posts:

0 comments:

Post a Comment