Saturday, August 29, 2020

కరీంనగర్‌లో భారీ ప్రమాదం, విద్యుత్ కార్యాలయంలో ఎగిసిపడ్డ మంటలు..

తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ విద్యుత్ కార్యాలయంలో ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసపడటంతో ఆందోళన నెలకొంది. అయితే ఫైరింజిన్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. కానీ భారీగానే ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సీపీ కమలాహసన్ రెడ్డి పరిశీలించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ECVohx

Related Posts:

0 comments:

Post a Comment