Sunday, March 29, 2020

లాక్‌డౌన్ ఎఫెక్ట్: సొంతూరుకు వెళ్లాలని .. 200 కిలోమీటర్లు నడిచి మృతి చెందిన వ్యక్తి

న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అయితే లాక్‌డౌన్‌తో పలు పరిశ్రమలు మూతపడటంతో అక్కడి కార్మికులకు ఏం చేయాలో తోచడం లేదు. దీంతో సొంత ఊళ్లకు పయనమయ్యారు. అయితే సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని సొంత గ్రామాలకు కాలినడకన బయలుదేరారు. వారి సొంతూళ్లు చాలా దూరంగా ఉన్నప్పటికీ కాలినడకపైనే బయలుదేరారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మృతి చెందాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UIGFG7

0 comments:

Post a Comment