Tuesday, February 18, 2020

మండలి రద్దుపై వైసీపీ, టీడీపీ దొందూ దొందే, తొలి సమావేశాల్లోనే ఎందుకు రద్దుచేయలేదు: పురందేశ్వరి

అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనమండలి రద్దుపై ఇరుపార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. శాసనమండలితో ఉపయోగం లేకుంటే తొలి సమావేశాల్లోనే ఎందుకు రద్దు చేయాలని వైసీపీని ప్రశ్నించారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు ఉపసంహరణకు మండలి మోకాలడ్డడంతో రద్దు చేయాలనే ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. మంగళవారం పురందేశ్వరి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P2BRcq

0 comments:

Post a Comment