Sunday, November 3, 2019

WAKE UP:ఆర్టీసీతో ఆగిపోదు, సింగరేణి, భూములు, నీరు కూడా విక్రయిస్తారు: భట్టి

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ అనడం సరికాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై పిలిచి మాట్లాడాల్సింది పోయి డెడ్‌లైన్ విధించడం సరికాదన్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల నేతలు మేల్కొవాలని కోరారు. ప్లీజ్ వెకప్ అంటూ పిలుపునిచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36nJilH

0 comments:

Post a Comment