Tuesday, November 19, 2019

పార్లమెంట్ భవనం వద్ద ప్రత్యక్షమైన ఇస్రో ఛైర్మన్ కే శివన్: అజిత్ ధోవల్ తో కలిసి.. !

న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా సుపరిచితుడైన భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ మంగళవారం పార్లమెంట్ భవనం వద్ద అనూహ్యంగా ప్రత్యక్షం అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో కలిసి ఆయన కనిపించారు. ఆయన ఎందుకు అజిత్ ధోవల్ ను కలిశారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అజిత్ ధోవల్ ను కలుసుకోవడానికే వచ్చానని శివన్.. తనను పలకరించిన విలేకరులకు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37jWjNo

0 comments:

Post a Comment