Saturday, October 26, 2019

గ్రామానికి 20 లక్షలు, హుజూర్‌నగర్‌ పట్టణానికి 25 కోట్లు, కృతజ్ఞతసభలో కేసీఆర్ వరాలజల్లు

హుజూర్‌నగర్ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. తమ అభ్యర్థి సైదిరెడ్డి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో విజయం తమలో మరింత సేవాభావాన్ని, అంకితభావాన్ని పెంచుతుందన్నారు. తమపై ప్రతిపక్షాలు ఎన్నో నిందలు వేశాయని కేసీఆర్ సునిశితంగా విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qONvP7

Related Posts:

0 comments:

Post a Comment