Wednesday, February 12, 2020

డేంజరస్ గ్యాంగ్ : అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పరిధిలో చోరీలకు పాల్పడుతున్న బీహార్ అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా వద్ద నుంచి భారీ ఎత్తున నగలు,డబ్బు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1కోటి వరకు ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు. ముఠా వద్ద నుంచి ఓ బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. బషీర్‌బాగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన వివరాలు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bxJGk4

Related Posts:

0 comments:

Post a Comment