Sunday, February 23, 2020

నన్ను వాడి గదికి రమ్మంటున్నాడు.. : కంటతడి పెట్టించిన యువతి సూసైడ్ నోట్

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపింది. ఓ యువకుడు తనను వేధిస్తున్నందు వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. మృతురాలు తన తల్లికి రాసిన ఆ సూసైడ్ నోట్ స్థానికులను కంటతడి పెట్టించింది. తాను చనిపోయాక కూడా నిందితుడిని ఏమి చేయవద్దని.. లేదంటే తన ఫోటోలు బయటపెడుతాడని యువతి పేర్కొనడం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32jxuPz

Related Posts:

0 comments:

Post a Comment