Monday, June 3, 2019

40 ఏళ్ల అనుభ‌వం: అయినా త‌ర‌చూ అదృశ్యం: నాడు అండ‌మాన్‌, నేడు అరుణాచ‌ల్‌!

న్యూఢిల్లీ: భార‌త వైమానిక ద‌ళానికి చెందిన ఆంటొనోవ్ - 32 ర‌కానికి చెందిన తేలిక‌పాటి విమానం అదృశ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపింది. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌గ‌న‌త‌లంలో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మాయ‌మైంది. వాయుసేన‌లో కీల‌క ప్ర‌దేశాల్లో జ‌వాన్లు, నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను త‌ర‌లించ‌డానికి వినియోగించే ఈ విమానం ఉన్న‌ట్టుండి గ‌ల్లంతు కావ‌డం అనేక అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. చైనా స‌రిహ‌ద్దుకు అత్యంత స‌మీపంలో ఇది గ‌ల్లంతు కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ietarf

Related Posts:

0 comments:

Post a Comment