Friday, April 26, 2019

నేడు ప్రధాని మోడీ నామినేషన్

వారణాసి : ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9.30గం.లకు బూత్ స్థాయి కార్యకర్తలతో మోడీ మాట్లాడనున్నా మోడీ... 11గంటలకు కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి 11.30గం.లకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W2cFnX

Related Posts:

0 comments:

Post a Comment